telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

పోలవరం కాపర్ డ్యాం వద్ద చిక్కుకున్న 18 పడవలు

polavaram

పోలవరంప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద గోదావరి నదిలో 18 పడవలు చిక్కుకున్నాయి. వీటిలో రెండు పడవలు మునిగిపోయాయి. మిగిలిన 16 పడవల్లో 31 మంది జాలరులు ఉన్నారు. కూనవరం నుంచి ధవళేశ్వరం వైపు వస్తుండగా కాపర్ డ్యాం వద్ద పడవలు చిక్కుకున్నాయి. మత్స్యకారులను కాపాడేందుకు బోట్లు వరద నీటిలోకి వెళ్లలేకపోతున్నాయి.

తమను కాపాడాలంటూ మత్య్సకారులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు పోలీస్ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం గ్రామానికి చెందిన వారు 8 నెలల క్రితం చేపల వేటకు వెళ్లి శుక్రవారం ఉదయం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Related posts