ఈసారి కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులంతా కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుంభమేళాలో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గుడారాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గుడారాల్లో ఉన్న కొంత నగదు పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. జనవరి 14న కుంభమేళా ప్రదేశంలోని దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది.