బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ కుటుంభంలో కరోనా వ్యాపించింది. గంగోలి సోదరుడు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శి స్నేహాశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం దాదా హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
బెంగాల్ మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్ అయిన స్నేహాశీష్ కోవిడ్-19 పాజిటివ్గా తేలడంతో బెల్లె వ్యూ హాస్పిటల్లో చేరారు. ‘గత కొద్దిరోజుల నుంచి స్నేహాశీష్ జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని’ క్యాబ్ అధికారి ఒకరు తెలిపారు.