telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఈవీఎం పోస్ట్ మాట్రం .. విస్తుపోతున్న ఓటరు..

evm postmatram by election staff

రేపే దేశంలో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో యూపీ (8), కర్ణాటక (14), మహారాష్ట్ర (10), అసోం (5), బీహార్ (5), చత్తీస్ గఢ్ (3), పశ్చిమ బెంగాల్ (3), జమ్మూకాశ్మీర్ (2), మణిపూర్ (1), త్రిపుర (1), ఒడిశా (5) రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, యూపీలో పోలింగ్ ఏర్పాట్లపై విమర్శలు వినిపిస్తున్నాయి. లోపాలతో ఉన్న ఈవీఎంలను పోలింగ్ సిబ్బందికి అందజేసినట్టు వార్తలు వస్తున్నాయి. దానికితోడు సిబ్బంది నిర్వాకం కూడా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలను ఏ భాగానికి ఆ భాగం విడదీసి అందులో ఏముందో చూస్తూ వాటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది చేష్టలు స్థానికులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈవీఎంలను వాళ్లు ఎందుకు విప్పదీస్తున్నారంటూ ఆగ్రా తదితర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts