ప్రియాంకా గాంధీ సోమవారం మధ్యాహ్నం లక్నో చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారిగా లఖ్నవూలో రోడ్ షో చేపట్టారు. సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తోడుగా ఈ రోడ్ షోను ప్రియాంక ప్రారంభించారు. బస్సుపైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక బార్ట రాబర్డ్ వాద్రా మాట్లాడుతూ …భార్య పొలిటికల్ ఎంట్రీతో పాటు ప్రియాంకను పరిపూర్ణ మహిళ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారన్నారు.ఈ రోడ్షోలో పార్టీ ఉత్తరప్రదేశ్ పశ్చిమ విభాగం ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. నగరంలోని అమౌసి ఎయిర్పోర్టు నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వరకు 25 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో కొనసాగనుంది.