టాలీవుడ్ లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 5న చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో చేరిన బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని, ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఎక్మో సపోర్ట్ తో పోరాడుతున్నట్లు వైద్యులు నిన్న తెలిపారు. అయితే బాలు కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇక తాజాగా ఎస్పీబీ ఆరోగ్యం పై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదిక స్పందించారు. “తన పాటలతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరించిన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు ఇతర భాషలలో తనదైన ముద్ర వేశారు ఆయన. అటువంటి సింగర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ట్విట్ చేశారు.
previous post