telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఔట్ సోర్సింగ్ కార్మికులకు టీటీడీ ఊరట: పవన్ హర్షం

pawan

ఔట్ సోర్సింగ్ కార్మికులకు టీటీడీ ఊరట కల్పించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. టీటీడీలో 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులపై వేటు పడిందని  వారిని ఆడుకోవాలని పవన్ జ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో 1400 మంది కార్మికులను కొనసాగించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని పేర్కొన్నారు.

కార్మికులను విధుల్లోకి తీసుకుని మానవత్వం చాటారని కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వారంతా శ్రీవారిని నమ్ముకుని 15 ఏళ్లుగా కొద్దిపాటి వేతనాలకే పారిశుద్ధ్య సేవ చేస్తున్నారని పవన్ వెల్లడించారు. కార్మికుల కోసం ప్రభుత్వం చేసే ప్రతిపనికీ జనసేన సహకారం ఉంటుందని తెలిపారు.

Related posts