ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న రియాల్టీ గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరోవైపు.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే టాక్ షో ద్వారా ప్రేక్షకులను తనదైన స్టైల్తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. తాజాగా మహేశ్ బాబు అతిథిగా వచ్చిన ఈ పోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోను షో మేకర్స్ విడుదల చేశారు.. ఇద్దరూ రాక్స్టార్స్ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేశారు.
ఈ ప్రోమోలో ‘వెల్కమ్ మహేశ్ అన్న’ అంటూ తారక్ మహేశ్ను ఆహ్వానించగా.. ‘అదిరిపోయింది సెటప్ అంతా’ అని సూపర్స్టార్ బదులిచ్చారు. అనంతరం ‘నా రాజా’ అంటూ ఎన్టీఆర్ తనదైన మేనరిజంతో జోష్ నింపారు. ఆ తర్వాత ‘కరెక్ట్ ఆన్సర్నే అటూ ఇటూ ఎందుకు తిప్పుతారు’ అని మహేశ్ అడగగా.. ‘సరదా కోసం’ అని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. ‘గురువుగారే బెటర్గా ఉన్నారు నీకన్నా’ అన్న మహేశ్ మాటలు నవ్వులు పూయించాయి. మొత్తంగా వీరిద్దరి సంభాషణ సరదా సరదాగా సాగింది. ఈ ప్రత్యేక ఎపిసోడ్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మహేశ్బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.