telugu navyamedia
సినిమా వార్తలు

ఒకే స్టేజ్ పైన‌ ఇద్ద‌రు రాక్‌స్టార్స్ సంద‌డి..

ఎన్టీఆర్​ హోస్ట్ గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న రియాల్టీ గేమ్​ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు. ఓవైపు వరుస సినిమాల‌తో బిజీగా గడుపుతున్న తారక్.. మరోవైపు.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే టాక్ షో ద్వారా ప్రేక్షకులను తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల్లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నాడు. తాజాగా మహేశ్‌ బాబు అతిథిగా వచ్చిన ఈ పోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమోను షో మేకర్స్‌ విడుదల చేశారు.. ఇద్ద‌రూ రాక్‌స్టార్స్‌ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేశారు.

ఈ ప్రోమోలో ‘వెల్​కమ్​ మహేశ్​ అన్న’ అంటూ తారక్​ మహేశ్​ను ఆహ్వానించగా.. ‘అదిరిపోయింది సెట‌ప్ అంతా’ అని సూపర్​స్టార్​ బదులిచ్చారు. అనంతరం ‘నా రాజా’ అంటూ ఎన్టీఆర్​ తనదైన మేనరిజంతో జోష్​ నింపారు. ఆ తర్వాత ‘కరెక్ట్​ ఆన్సర్​నే అటూ ఇటూ ఎందుకు తిప్పుతారు’ అని మహేశ్​ అడగగా.. ‘సరదా కోసం’ అని ఎన్టీఆర్​ సమాధానమిచ్చారు. ‘గురువుగారే బెటర్​గా ఉన్నారు నీకన్నా’ అన్న మహేశ్​ మాటలు నవ్వులు పూయించాయి. మొత్తంగా వీరిద్దరి సంభాషణ సరదా సరదాగా సాగింది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ కోసం అటు ఎన్టీఆర్‌ అభిమానులు, ఇటు మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts