శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న అందుకున్న సంజయ్…. విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటుఈడీ బృందం ముంబయిలోని రౌత్ ఇంటికి చేరుకుని, సోదాలు ప్రారంభించారు. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలోనే సంజయ్ రౌత్ ట్విట్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ఇలాంటి దాడులు ఎన్ని నిర్వహించినా తాను శివసేనను వీడేది లేదన్నారు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా” అని ట్వీట్ చేశారు.