telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మాట తప్పింది: ఉత్తమ్

uttam congress mp

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమదేనని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు. రాష్ట్రా వ్యాప్తంగా పండిన 1 కోటి 5 లక్షల టన్నుల వరిలో ప్రతి గింజ కొంటామని తెలంగాణ సీఎంవో మాట ఇచ్చి నేటికి 45 రోజులైందని అన్నారు. కానీ ఇప్పటివరకు కొన్నది 44 లక్షల టన్నులేనని విమర్శించారు.

రాష్ట్రంలో వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ముమ్మాటికీ మాటల ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఈ రోజు వెలుగు పేపర్ లో మొదటి పేజీ చూడండి అంటూ మీడియా కథనాన్ని కూడా ఆయన పోస్టు చేశారు.

Related posts