కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే నాగార్జున “మన్మథుడు-2” చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా, పెంగ్విన్ లాంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. “మహానటి”తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కీర్తి సురేష్ తాజాగా తేజ డైరెక్ట్ చేస్తున్న ‘అలిమేలు మంగ- వెంకటరమణ’ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా గోపీచంద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఇద్దరు హీరోయన్లు నటిస్తున్నారట. అయితే ఒక హీరోయిన్గా కాజల్, రెండో హీరోయిన్గా కీర్తి సురేశ్ నటిస్తున్నారని సమాచారం. కానీ కాజల్ ఈ మూవీలో నటించడంలేదని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ప్లేస్లోనే కీర్తి సురేశ్ను తీసుకుంటున్నారట. మరి ఈ వార్తలపై దర్శకుడు తేజ ఏమంటారో చూడాలి.
previous post
లిప్ లాక్ గురించి మాట్లాడితే… ఆ అమ్మాయితో పని కష్టం : యామీ గౌతమ్