telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటమి భయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..

టీఆర్‌ఎస్‌పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ఫైర్‌ అయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏవిధంగా నైనా గెలవాలననే దురుద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసిందని ఆగ్రహించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బిజెపి కార్యకర్తల పై దాడులు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను పోలీసు యంత్రాంగాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం తన కనుసన్నల్లో ఉంచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని… టిఆర్ఎస్ కార్యకర్తలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే తనపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి ఈ దాడులకు నిరసనగా ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కె.లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు తదితరులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేయనున్నారని బండి సంజయ్‌ తెలిపారు.

Related posts