telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అరుదైన వీడియోను పోస్ట్ చేసిన పూరీ జగన్నాథ్

Puri

రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పూరీ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘లైగ‌ర్’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్‌కి జోడీగా న‌టిస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే ఈ గ్యాప్ లో తన సినిమాకు సంబంధించిన పనులతో పాటు, సోషల్ మీడియాలో కూడా జగన్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1954 నాటి వీడియో అది. బాలీవుడ్ తారలు జార్జియాకు వెళ్లిన సమయంలో తీసినది. ఈ వీడియోలో రాజ్ కపూర్, దేవానంద్, నర్గీస్, బిమల్ రాయ్, బల్రాజ్ సహానీ తదితరులు ఉన్నారు.

Related posts