telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్… ఈరోజే ముహూర్తం

Vaishnav

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీ “ఉప్పెన” తో ఎంట్రీ ఇచ్చాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా వైష్ణవ్ ఇప్పుడు మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా పూర్తయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందట. రేపటి నుంచే షూటింగ్ ఆరంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. అయితే ఇప్పుడు పవన్ తో క్రిష్ చేస్తున్న ప్రాజెక్ట్ కు ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ను ఆ లోపు పూర్తి చెయ్యాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

Related posts