telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 19న ఏపీ మంత్రివర్గ స‌మావేశం

cm jagan ycp

సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ మంత్రిమండలి సమావేశంలో పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా నివారణ, చికిత్స, కొత్త జిల్లాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించే అవకాశముంది.

ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇటీవల తీసుకువచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు మొదలైన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభంపైనా ఈ సమావేశంలో మంత్రులు తమ అభిప్రాయాలు తెలుపనున్నారు.

Related posts