టీవీ నటి లలిత అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమీర్పేటలోని ఉమెన్స్ హాస్టల్లో నటి లలిత ఉంటోంది. లలిత స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం. ఇప్పటి వరకూ ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఛానెళ్లలో ప్రసారం అయ్యే పలు టీవీ సీరియల్స్లో నటించింది. ప్రేమ, కళ్యాణ వైభవం, స్వర్ణ ఖడ్గం అనే సీరియల్స్లో ప్రస్తుతం నటిస్తోంది. సడెన్గా ఆమె కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లలితను తీసుకెళ్లినట్టు ఆమె స్నేహితులు పోలిసుల విచారణలో వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇంకా ఆమె అదృశ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
previous post