telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

షాకింగ్ : ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

రాజా మహేంద్రవరం సెంట్రల్ జైల్ లో ఉన్న టిడిపి నేత, మాజీ ఎమ్యెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు కరోనా సోకింది. ఆయన తో పాటు సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి హై కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి సిటీ స్కాన్ తీయించగా ఇద్దరికీ కరోనా పాజిటివ్ తేలిందని జైలు సూపరెంటెడెంట్ రాజారావ్ తెలిపారు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇద్దరినీ విజయవాడ ఆస్పత్రికి తరించే ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా సంగం డైరీ అక్రమాల కేసులో ధూళిపాళ్ళ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Related posts