telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకే ఓడిపోయాము : ధోని

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్ లోనే ఢిల్లీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో భారీ టార్గెట్‌ను ఊదేసి.. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్ని బెడిసి కొట్టాయని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘మా బౌలింగ్‌ ఆలోచనలు బెడిసికొట్టాయి. ఇక ముందు మ్యాచుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం. టాస్‌ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాత్రి పూట మంచు ప్రభావం ఉంటుంది. 7.30కే మ్యాచ్ ప్రారంభమవ్వడం చేజింగ్ టీమ్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. ఈ టైమ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 15-20 పరుగులు ఎక్కువ చేయాల్సిందే. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా చేజింగ్ టీమ్‌ను ఆపడం కష్టం అవుతుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కదు. టాస్ ఓడగానే వీలైనన్ని పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకున్నాం. అదే వ్యూహంతో బరిలోకి దిగాం. కానీ అద్భుత బంతులకు మా ఓపెనర్లు వెనుదిరిగారు. ఇక మా బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. పదే పదే బౌండరీలు కొట్టే బంతులు వేసారు. మా బౌలింగ్ మరింత మెరుగవ్వాలి తదుపరి మ్యాచ్‌కు మా తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం అని తెలిపాడు.

Related posts