telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ర్యాపిడ్ టెస్టు కిట్లు.. నిమిషాల్లో కరోనా టెస్ట్ రిపోర్ట్‌!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు పలువురు అధికారులతో చర్చించారు.

కరోనా పరీక్షల కోసం అందుబాటులోకి తెచ్చిన ర్యాపిడ్‌ కిట్స్‌ను సీఎం జగన్ పరిశీలించారు.ఒక్కో కిట్‌తో రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లోనే వీటిని తయారు చేశారు. 50 నిమిషాల్లోనే ఒక టెస్టింగ్‌ రిపోర్ట్‌ వస్తుంది. మరో వారం రోజుల్లో 10,000 టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో మెడికల్ కిట్లు, వసతుల కొరత లేకుండాప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య, ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించి, కరోనా లక్షణాలతో ఉన్న 5,000 మందిని గుర్తించింది. ఇప్పటికే వారిలో దాదాపు 2,000 మందికి పరీక్షలు అవసరమని స్పష్టం చేసింది. .

Related posts