telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్యం టెండర్ ఒక్కరికే ఎలా ఇస్తారు? దేవినేని ఉమ

devineni on power supply

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రమంతా మద్యం సరఫరాకు టెండర్ ఒక్కరికే ఎలా ఇస్తారు? అని ప్రశించారు. మద్యం రవాణాలో అస్మదీయులకు కోట్ల రూపాయలు కట్టబెట్టేలా ఒక్కరికే టెండర్ ఇచ్చారని దుయ్యబట్టారు. గతంలో పెట్ కు 18 రూపాయలు. ఇప్పుడు 30 పైనే కోట్. మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు? అని ప్రశించారు.

అనామక బ్రాండ్లు, నాసి రకం మద్యంతో పాటు రవాణాలోను జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్‌ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.

డిపోల నుంచి మద్యం రవాణా చేసేందుకు టెండర్లు పిలిచారని, 13 జిల్లాలకు కలిపి ఒకే టెండర్‌ ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. అది కూడా ఒక్కరు మాత్రమే టెండర్‌ వేశారని తెలిపారు. అంతేగాక ప్రస్తుతమవుతున్న ఖర్చు కంటే దాదాపు 60 శాతం ఎక్కువ ధర కోట్‌ చేసినట్లు సమాచారం అందిందని ఆరోపించారు.

Related posts