telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : ఢిల్లీతో .. పోరాడుతున్న రాజస్థాన్.. నాలుగు వికెట్ల నష్టానికి..

delhi will win on rajastan today

ఐపీఎల్ లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇశాంత్‌ వేసిన రెండవ ఓవర్‌ చివరి బంతికి రహానే(2) ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ ఇశాంత్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఐదో బంతికి లివింగ్‌స్టోన్‌(14) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ వెంటనే అక్సర్‌ వేసిన ఓవర్‌లో సంజూ శాంసన్‌(5) రనౌట్‌ అయ్యాడు.

ఇక ఇశాంత్‌ వేసిన ఆరో ఓవర్‌ మొదటి బంతికి ఫోర్‌ కొట్టిన లామ్‌రోర్‌(8) ఆ తర్వాతి బంతికి పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీని తో నిర్ణిత ఓవర్లలో 115 పరుగులు చేసింది రాజస్థాన్. ఢిల్లీ లక్ష్యం 116 పరుగులు, తేలికగా విజయం సాదిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts