telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతిరోజూ ఆవు మూత్రం తాగుతా… అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Akshay-Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా జరిగిన ఇన్స్‌స్టాగ్రామ్ లైవ్‌లో తాను గోమూత్రం సేవిస్తానని ఓపెన్‌గా చెప్పేసి ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. వైల్డ్ లైఫ్ హీరో బేర్ గ్రిల్స్ ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో “ఇన్ టు ది వైల్డ్” అడ్వెంచర్ షోని ఫినిష్ చేశారు. ఈ షో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానున్న నేపథ్యంలో హీరోయిన్ హ్యూమా ఖురేషితో కలిసి కాసేపు వాళ్లిద్దరూ ఇన్స్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్నారు. అయితే గతంలో బేర్ గ్రిల్స్‌తో కలిసి ఏనుగు పూప్ టీ తాగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ అనుభవం ఎలా అనిపించిందంటూ అక్షయ్ కుమార్‌ని ప్రశ్నించింది హీరోయిన్ హ్యూమా ఖురేషి. దీనిపై రియాక్ట్ అయిన అక్షయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఏనుగు పూప్ టీ తాగడం తనకు ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించలేదని, దానికి కారణం తాను ప్రతిరోజూ ఆవు మూత్రం తాగుతానని ఓపెన్‌గా చెప్పేశారు అక్షయ్. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే ఆవు మూత్రంలో ఎన్నో పోషకాలు ఉంటాయని, ఆరోగ్య పరంగా అది మానవ శరీరానికి మంచిదని శాస్త్రవేత్తలు కూడా చెబుతుండగా.. అక్షయ్ కూడా అదే మాట చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీబాంబ్‌’ సినిమాలో నటిస్తున్నారు అక్షయ్ కుమార్.

Related posts