అక్రమంగా కోటి రూపాయల నగదు తీసుకువెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ మెట్రో స్టేషన్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వీరు రూ. కోటి నగదును తరలిస్తుండగా సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. నిందితులను రాజస్థాన్కు చెందిన వికాస్ చౌహాన్(20), మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఆర్తి(20)గా గుర్తించారు.
జంగ్పూరా మెట్రో స్టేషన్లో వీరి బ్యాగులు స్కాన్చేయగా నగదు బయటపడింది. నగదుపై ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఇనిస్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ తెలిపారు. నగదును ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
కొలిమిలో యువత భవిష్యత్తు..మోదీ సర్కార్ పై సోనియా ఫైర్