వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోవడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ర్టానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని సూచించారు.
కార్మికులు సొంత రాష్ట్రానికి వెళ్ళేందుకు రైళ్లు సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి అవసరమైతే బస్సుల ద్వారా తరలించాలన్నారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకొనే వలస కార్మికులెవరూ నడిచిపోవాలనే ఆలోచన చేయవద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని తమ సొంత ప్రాంతాలకు తరలిస్తుందని చెప్పారు.