telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్… ఢిల్లీ టార్గెట్ …?

ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్లు ఇద్దరు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించారు. అయితే ఏ మ్యాచ్ లో మొదటి వికెట్ కు 122 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అలాగే చివర్లో దీపక్ హుడా (22) అలాగే షారుఖ్ ఖాన్ 15 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 195 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, కగిసో రబాడా, అవెష్ ఖాన్, లుక్మాన్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 196 పరుగులు చేయాలి. కానీ ఈ రెండు జట్లలో ఢిల్లీ పైన పంజాబ్ కే మంచి రికార్డు ఉంది. కానీ ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టులోకి స్మిత్ రావడంతో వారి బ్యాటింగ్ బలం బాగా పెరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అతను ఎలా రాణిస్తాడు అనేది చూడాలి.

Related posts