telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్‌ మూవీకి సెలవు ఇవ్వండి… మోడీకి ట్వీట్‌..!

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను జూలై 16న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో రాకీ బాయ్‌ని తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని ఏకంగా ప్రధాని మోడీకి ట్విట్టర్‌లో ఓ లేఖ రాశారు. కేజీఎఫ్‌ చాఫ్టర్‌ 2 రిలీజ్‌ రోజున… ఫ్యాన్స్‌ ఎమోషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు సెలవు ప్రకటించాలని కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. యష్‌ బర్త్‌ డే రోజు రిలీజైన కేజీఎఫ్‌ టీజర్‌ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

Related posts