telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమా కూడా తెలుగులోనేనా…?

Prashanth-neel

కేజీఎఫ్ సినిమాతో తన స్థాయిని పెంచుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు తన తరువాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తీయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సలార్ అనే పేరును కూడా ఖరారు చేశారు. అయితే సలార్ తరువాత కూడా ప్రశాంత్ తెలుగు హీరోలను విడిపెట్టడని, తెలుగు స్టార్ హీరోతో మరో సినిమా తీసేందుకు చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య ప్రశాంత్ ఎన్‌టీఆర్‌ హీరోగా సినిమా తెరకెక్కిస్తాడని అభిమానులు ఎదురు చూశారు. కానీ ప్రశాంత్ ప్రభాస్‌తో సినిమాను ప్రకటించాడు. అయితే ఈ సినిమా పూర్తయ్యాక తెలుగు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో సినిమా తీయనున్నట్లు సమచారం. బహుశా ఈ సినిమా 2022నాటికి పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ సినిమానే పట్టాలెక్కలేదు కానీ ఆ తరువాతి సినిమాను కూడా ప్రశాంత్ ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరిస్తున్నాడు. దాని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమాలో చేయనున్నాడు. ఆతరువాత ప్రశాంత్‌తో చేయనున్నాడని సమాచారం. ప్రశాంత్ కూడా ఎన్‌టీఆర్ సినిమా తరువాత రామ్ చరణ్‌ హీరోగా సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు మెదలుపెట్టాడని సమాచారం. దీనిని ప్రముఖ సినిమా బ్యానర్‌ సంస్థ అనధికారికంగా ప్రకటించింది. చూడాలి మరి సినిమా ఉంటుందా… లేదా అనేది.

Related posts