telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారో లేదో కేసీఆర్ తేల్చుకోవాలి !

సీఎం కేసీఆర్‌పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు అసలైన బంధువు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. “టీఆరెస్ ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో తరచుగా భద్రాద్రి ఆలయం గురించి ప్రస్తావిస్తున్నారు. అయోధ్య రామాలయాన్ని దేశ ప్రజలందరూ భక్తిభావంతో రామయ్య జన్మభూమిలో స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లాగే భద్రాద్రిలో కూడా ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దితే ప్రజలందరూ అందుకు హర్షిస్తారు. భక్తితో ఆ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అది సహించకో.. భద్రాద్రిలో బ్రహ్మాండంగా నిర్మాణాల అభివృద్ధి చేపడతామని మంత్రులతో మెలికలు పెట్టిస్తున్నారు. ఇందరు టీఆరెస్ ఎమ్మెల్యేలు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఖండించలేని ముఖ్యమంత్రిగారు రామాలయానికి అనుకూలమా? కాదా? స్పష్టంగా ప్రకటన చెయ్యాలి లేదా నేను మాటల్లోనే హిందువునని… అయోధ్య విషయంలో ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారో… కేసీఆర్ తేల్చుకోవాలి.” అంటూ విజయశాంతి ఫైర్‌ అయ్యారు.

Related posts