telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానికి సమంత వార్నింగ్… ఏం చేశాడంటే…!?

Samnatha

‘జాను’ సినిమా విడుదలయ్యాక సమంత శ్రీవారిని దర్శనానికి వెళ్లారు. సమంత ఎప్పుడు తిరుమల వెళ్లినా తప్పకుండా కాలినడకే కొండ ఎక్కుతారు. అయితే మొన్న వెళ్లినప్పుడు సమంత ఓ అభిమానికి వార్నింగ్ ఇచ్చారట. మెట్లు ఎక్కుతున్న సమయంలో ఓ యువకుడు సమంత ఫొటోలు తీసాడు. ఒక ఫొటో తీసి ఊరుకుని ఉంటే ఆమె కూడా లైట్ తీసుకునేది. కానీ తీస్తూనే ఉన్నాడు. దాంతో సమంతకు కోపం వచ్చింది. ‘మర్యాదగా ప్రవర్తించు. నా ఫొటోలు తీయడం ఆపు’ అంది. దాంతో అతను కూడా ఓకే అంటూ ఊరుకున్నాడు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts