టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత ఇటీవల తమ వైవాహిక జీవితానికి స్వస్తి అధికారికంగా ప్రకటించిన అనంతరం.. సోషల్మీడియాలో సామ్పై పలు పుకార్లు వచ్చాయి. ‘సమంత పిల్లలను వద్దనుకుంది.. అబార్షన్ కూడా చేయించుకుందని, కొందరు విడాకుల విషయంలో సామ్దే తప్పు అని దెప్పి పొడుస్తున్నారు.
ఇక తాజాగా వీటిపై తీవ్రంగా ఖండిస్తూ సమంత భావోద్వేగ ట్వీట్ ఒకటి పోస్ట్ చేసింది. ”నాకు అఫైర్స్ ఉన్నాయని.. పిల్లలు వద్దనుకున్నానని, అవకాశవాదినని.. అబార్షన్లు చేయించుకున్నానని” తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సమంత మండిపడింది. ఇలా తనపై పర్సనల్గా ఎటాక్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. విడాకులు తీసుకోవడం ఎంతో బాధతో కూడుకున్నదని.. ఈ కఠిన సమయంలో తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు” అంటూ సమంత ట్వీట్ చేసింది.
దీనిపై తాజాగా స్పందించిన ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారు. సామ్ పిల్లల్ని కనేందుకు అంతా సిద్ధం చేసుకుందని, కానీ రెండు నెలల్లోనే ఏదో జరిగి ఉంటుందని చెప్పారు. ”శాకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదించినప్పుడు.. అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందని. ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నట్లు చెప్పింది. ఇప్పట్లో సినిమా చేయనని వివరించింది.
కానీ.. శాకుంతలం కథ నచ్చడం వల్ల కొన్ని షరతులు విధించి ఒప్పుకొంది. జులై, ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని కోరింది. మేము దానికి అంగీకరించాం. ఈ చిత్రం తర్వాత విరామం తీసుకుని, తల్లి కావాలని ఆమె అనుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చైతూ-సామ్ విడిపోవడం షాకింగ్గా ఉందని నీలిమ గుణ అన్నారు.
ప్రముఖ వెబ్ సైట్ కు సందీప్ కిషన్ కౌంటర్