సాయి పల్లవి ఫిదా మూవీతో 2017లో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అందులో భానుమతిగా తెలంగాణ యాసతో మాట్లాడి కుర్రకారుని కట్టిపడేసింది. చిత్రపరిశ్రమలో సా యి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అచ్చమైన తెలుగమ్మాయిల అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుందీ ఈ ముద్దుగుమ్మ.
తాజా సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. పూజ నటించిన మలయాళ సినిమా ‘ ‘చిత్తారాయి సెవ్వనం’ పేరుతో తెరకెక్కనుంది. తాజాగా సినిమా ఫస్ట్లుక్ను ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రముఖ నటుటు, దర్శకుడు సముద్రఖని కూడా నటిస్తున్నాడు.
ఇందులో పూజ సముద్రఖని కూతురిగా కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్తో పాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ఖరారుచేసింది చిత్రబృందం. డిసెంబర్ 3న ‘చిత్తారాయి సెవ్వనం’ సినిమా డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పోస్టర్ చూస్తే అచ్చం సాయి పల్లవిలా కనిపిస్తుంది.
నన్నో క్రిమినల్ లా చూశారు… గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కెనడియన్ ఫిలింమేకర్ ఫైర్