‘నరసింహుడు’ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన సమీరా ఆ తరువాత ‘జై చిరంజీవ’, ‘అశోక్’ చిత్రాల్లో నటించింది. ‘అశోక్’ మూవీలో నటించే సమయంలో వీరిద్దరి మధ్య రూమర్లు వచ్చాయి. ఎన్టీఆర్, సమీరా ఇద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు గుప్పుమన్నాయి. అందులోనూ సమీరా తండ్రిది తెలుగు ప్రాంతం కావడంతో ఆ పుకార్లపై వారి బంధువులకు ఆయన సమాధానం చెప్పాల్సి వచ్చిందట. ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకు సమీరా టాలీవుడ్ను వదిలి వెళ్లిందట. ఈ విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నేను అందరిలో కలిసిపోయే మనిషిని. అలాగే ఎన్టీఆర్తో కలిసిపోయా. కానీ మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని పుకార్లు వచ్చాయి. ఫ్యాన్స్ నా పేరును సమీరా రెడ్డి నుంచి సమీరా ఎన్టీఆర్గా మార్చేశారు. నన్ను కేవలం ఎన్టీఆర్ హీరోయిన్గా చూసేవారు. అయినా నేను ఎన్టీఆర్ హీరోయిన్గా ఉండాలనుకోలేదు. నేను మంచి నటిని, డ్యాన్సర్ను. అందరూ నాలో అదే గుర్తిస్తారనుకున్నా. కానీ ఈ రూమర్లు నన్ను ఇబ్బంది పెట్టాయి. నాకు తెలిసి ఎన్టీఆర్ను కూడా ఈ పుకార్లు బాధపెట్టి ఉండొచ్చు అని సమీరా తెలిపింది. కాగా 2014లో సమీరా అక్షయ్ వర్దే అనే పారిశ్రామిక వేత్తను వివాహమాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.