*మొదలైన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
*యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్..
*ఫ్యాన్స్తో నిండిపోయిన పోలీస్ గ్రౌండ్..
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుపాటి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఇందులో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు.
ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్ లో జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది.
ఫ్యాన్స్తో పుల్గా నిండిపోయింది యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్. ఆ ప్రాంతంలో పోలీసులు వారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది..మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి రీమేక్గా సాగర్ కె.చంద్ర ‘భీమ్లా నాయక్’ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే, మాటలు అందించగా థమన్ సంగీతం అందించారు.