telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

క్రికెట్ ఆటగాళ్లు బుమ్రా, స్మృతి మందానకు .. విజ్డెన్ పురస్కారాలు..

cricketers bruma and smruti mandanna got

భారత క్రికెటర్లు జస్ప్రిత్ బుమ్రా, స్టార్ బ్యాట్స్‌విమెన్ స్మృతి మందాన ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానాక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన ఐదుగురిలో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. ఆసియా నుంచి పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్, శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నె, అఫ్గనిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ ఈ అవార్డును అందుకోనున్నారు.

మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, దీప్తీ శర్మ తర్వాత స్మృతి మందాన ఈ పురస్కారానికి ఎంపికైన మూడో క్రీడాకారిణి కావడం విశేషం. ఈ సీజన్ వీరంతా తమ తమ విభాగాల్లో అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో వీరిని అవార్డు కమిటీ ఎంపిక చేసింది. లెజెండ్స్ గుండప్ప విశ్వనాథ్, లాలా అమరనాథ్ విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

Related posts