telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ పెద్దలకు జగన్ వంగివంగి దండాలు: సీపీఐ నేత రామకృష్ణ

ap cpi leader ramakrishna on jagan as cm

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. రూ. 4 వేల కోట్ల అప్పు కోసం జగన్ విద్యుత్ మీటర్లను బిగిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు.

విద్యుత్ మీటర్లను బిగించిన రోజు నుంచే జగన్ పతనం ప్రారంభమవుతుందని అన్నారు. ఢిల్లీ పెద్దలకు జగన్ వంగివంగి దండాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రంలో ఒకలా, పార్లమెంటులో మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఇళ్లు తగలబెట్టి బొగ్గులు ఏరుకోవాలనుకుంటున్నారని అన్నారు.

సీపీఎం నేత మధు మాట్లాడుతూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కొత్త వ్యవసాయ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా 29, 30 ,1 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతామని చెప్పారు.

Related posts