దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. కరోనా కేసుల సంఖ్య 10,00,000 మార్కును దాటడం పట్ల రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్పై కేంద్ర ప్రభుత్వం పోరాడుతున్న తీరు సరిగా లేదని విమర్శించారు.
దేశంలో కేసుల సంఖ్య ఈ వారం 10 లక్షలు దాటుతుందని నాలుగు రోజుల క్రితమే రాహుల్ గాంధీ హెచ్చరించారు. తాను చెప్పినట్లుగానే కేసుల సంఖ్య ఆ మార్కును దాటిన విషయాన్ని రాహుల్ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇదే వేగంతో కేసుల వ్యాప్తి కొనసాగితే ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా సోకిన వారు 20 లక్షల వరకు ఉంటారు. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ హితవు పలికారు.