ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మే 23న జరిగే ఓట్ల లెక్కింపు కోసం 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీ, విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ, తూర్పు గోదావరిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో లెక్కిస్తారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీ.
విజయనగరం: శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీ, విజయనగరంలోని జేఎన్టీయూ కే ఇంజనీరింగ్ కాలేజీ, లెండీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పోలిస్ ట్రైనింగ్ కాలేజీ.
విశాఖపట్నం: విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ.
అనకాపల్లి: ఆంధ్ర యూనివర్సిటీ
కాకినాడ: కాకినాడ జేఎన్టీయూ
అమలాపురం: కాకినాడలోని జిల్లా స్పోర్ట్ అథారిటీ, జేఎన్టీయూ, రంగరాయ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం.
రాజమండ్రి: కాకినాడలోని ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయూ కాకినాడ, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ.
నరసాపురం: విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డెంటల్, స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీ.
ఏలూరు: ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ.
మచిలీపట్నం: మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ.
విజయవాడ: విజయవాడలోని ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
బాపట్ల: పర్చూరు, అద్దంకి, చీరాల, ఎస్ఎన్పాడు నియోజకవర్గాల ఓట్లను వల్లూరు మండలంలోని పేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భవనంలో.., వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల ఓట్లను నాగార్జున యూనివర్సిటీలో లెక్కిస్తారు.
ఒంగోలు: రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్నకు చెందిన విద్యా భవనాలు.
నంద్యాల: రాయలసీమ యూనివర్సిటీ.
కర్నూలు: పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ, రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీ.
అనంతపురం: జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ.
హిందూపురం: ఎస్కేయూలో…
కడప: కేఎల్ఎం ఇంజనీరింగ్ కాలేజీ
నెల్లూరు: రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్ కాలేజీ, నెల్లూరులోని డీకే గవర్నమెంట్ కాలేజీ.
తిరుపతి: నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ, పూతలపట్టులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్కేఎం లా కాలేజీ
రాజంపేట: కడపలోని కేఎల్ఎం ఇంజనీరింగ్ కాలేజీ, పూతలపట్టులోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల.
చిత్తూరు: శ్రీ శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భవనం.
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.
నరసరావుపేట: నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లెక్కించనున్నారు.