telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో ఇప్పటివరకు 28 కరోనా కేసులు: కేంద్ర ఆరోగ్య మంత్రి

iguru app for paper less work by dr.harshavardhan

దేశంలో ఇప్పటివరకు 28 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఢిల్లీలో  వ్యక్తి కుటుంబానికి, ఆగ్రాలో నివసిస్తున్న మరో ఆరుగురికి కరోనా సోకినట్టుగా గుర్తించామని తెలిపారు. రాజస్థాన్ కు వచ్చిన ఇటాలియన్లలో 16 మందికి కూడా వైరస్ ఉన్నట్టు తేలిందని, ఇప్పటికే కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి, తెలంగాణలో మరొక కేసు నమోదయ్యాయని చెప్పారు.

మొత్తంగా దేశవ్యాప్తంగా 28 మందికి వైరస్ సోకినట్టు ఇప్పటివరకు సమాచారం అందిందని తెలిపారు. పెద్ద సంఖ్యలో అనుమానితులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించారు. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చినవారికి స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు నివసించిన ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేయిస్తున్నామని, వైరస్ నిరోధక చర్యలు చేపట్టామని వివరించారు.

Related posts