టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి చెందారు. ఆమె మృతికి ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్బుక్లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పకితే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కట్టారు. మరికొందరు ఆమె మృత్యువార్త వినగానే, దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్రామ్గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్కు తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.