తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కమిషన్ల కోసమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కేసీఆర్ స్నేహం నటిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ది యూజ్ అండ్ త్రో మనస్తత్వమని, జగన్ తో స్నేహం కూడా ఆయన అవకాశవాద ఎత్తుగడల్లో భాగమేనని ఘాటైన విమర్శలు చేశారు.
జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన విషయం, రెండు రాష్ట్రాల అభ్యున్నతి కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్నేహం అంతా ఒట్టిదేనని వివేక్ తోసిపుచ్చారు. కేవలం కమిషన్ల కోసం జగతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారన్నారు. ఆ అవసరం తీరాక పక్కన పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. ఎవరినైనా వాడుకుని వదిలేయడం కేసీఆర్ రాజకీయమని వివేక్ వ్యాఖ్యానించారు.