telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా డాటర్ వెబ్ సిరీస్ కు కరోనా ఎఫెక్ట్

Sushmitha

మెగా డాటర్ సుష్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. సుష్మిత నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీనికి ఆనంద్ రంగా దర్శకుడు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కరోనా వల్ల ఆగిపోయింది. సుష్మితా ప్రొడక్షన్ టీంలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సమాచారం. అందువల్ల అతనికి సన్నిహితంగా ఉన్నవారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపిందట. అలాగే అప్పటివరకు షూటింగ్ బంద్ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

Related posts