ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు న్యుమోనియా కూడా జతకావడంతో సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నారని, అందుకే కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తీవ్ర జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన చేరారు.
మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. బుధవారం మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా ప్రకటించారు. కరోనా బారిన పడిన నేపథ్యంలోఆరోగ్య శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియాకు ఆయన అప్పగించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్ మరాఠే, డిప్యూటీ సీఎం శిసోడియా సలహాదారు అభినందిత కూడా కరోనా బారిన పడ్డారు.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్