telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కశ్మీరీ జర్నలిస్టును చితకబాదిన యువకులు!

Kashmir journalist attacked at Pune

పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీరీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్ కు చెందిన 24 ఏళ్ల జర్నలిస్ట్ జిబ్రాన్ నజీర్ ను ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. స్థానికంగా ఉన్న ఓ వార్తాపత్రికలో నజీర్ పని చేస్తున్నాడు.ఈ దాడి గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. తన నివాసానికి బైక్ పై వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దాడి జరిగింది.

దాడికి పాల్పడినట్టు అజారుద్దీన్ షేక్, దత్తాత్రేయ లవాతేలపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా జర్నలిస్టు నజీర్ మాట్లాడుతూ తనను కశ్మీర్ తిరిగి వెళ్లిపోవాలని దాడి చేసిన వ్యక్తులు చెప్పారని తెలిపాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తాను ఆగినప్పుడు తన ఫోన్ ను లాక్కుని, బైక్ ను ధ్వంసం చేశారని చెప్పాడు. అయితే, ఇది ముందుగా ప్లాన్ చేసుకుని చేసిన దాడి కాదని తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నజీర్ కు ఇద్దరు వ్యక్తులు క్షమాపణలు చెప్పడంతో నజీర్ కేసును ఉపసంహరించుకున్నాడు.

Related posts