telugu navyamedia
వార్తలు సామాజిక

‘కోరోనిల్’ పేరుతో కరోనాకు మందు: రాందేవ్‌ బాబా

Ramdev baba

ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనాకు పతంజలి సంస్థ ఆయుర్వేద మందు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాందేవ్ బాబా హరిద్వార్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ‘కోరోనిల్’ పేరుతో మార్కెట్‌లో ఈ ఆయుర్వేద మందును ఆయన విడుదల చేశారు. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయొచ్చని ఆయన చెప్పారు.ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు.

Related posts