telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ ధరలు

కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు దేశంలో రోజు రోజుకు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13-16 శాతం పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ.2,300 నుంచి రూ.2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం ఉన్న రూ. 2,900 నుంచి రూ.3,300కి పెంచింది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ. 4000, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ.4700 కి పెంచింది పౌర విమానయాన శాఖ. అలాగే 120-150 నిమిషాల ప్రయాణానికి రూ. 6100, కాగా 180-210 నిమిషాల ప్రయాణానికి రూ.8700గా నిర్ణయం తీసుకుంది పౌర విమానయాన శాఖ.

Related posts