telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎనిమిది మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

AP Congress candidates list release shortly

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకుగాను 8 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఏఐసీసీ విడుదల చేసింది. మిగిలిన 9 స్థానాలకు అభ్యర్థులను శనివారం ప్రకటించనుంది. అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఏఐసీసీ స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ కేసీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ ఖుంటియా తదితరులు పాల్గొన్నారు.

మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులపై సమీక్షించిన అనంతరం జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి సమర్పించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసంలో సమావేశమైన సీఈసీ తెలంగాణ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనా సమీక్ష జరిపింది. సీఈసీ సూచనల మేరకు 8 స్థానాల్లో అభ్యర్థులతో తొలి జాబితాను ఏఐసీసీ ప్రకటించింది.

అభ్యర్థుల తొలి జాబితా:
1. ఆదిలాబాద్‌: రమేశ్ రాథోడ్
2. మహబూబాబాద్‌: బలరాం నాయక్‌
3. పెద్దపల్లి: ఎ.చంద్రశేఖర్‌
4. కరీంనరగ్‌: పొన్నం ప్రభాకర్‌
5. మల్కాజిగిరి: రేవంత్‌రెడ్డి
6. జహీరాబాద్‌: మదన్‌మోహన్‌
7. చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
8. మెదక్‌: గాలి అనిల్‌కుమార్‌

Related posts