telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇలా చేస్తే జనాభా నియంత్రణ సాధ్యం: బాబా రాందేవ్

Baba Ramdev Sensational comments

దేశంలో జనాభా పెరుగుదలపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వానికి సంచలన సూచన చేశారు. బుధవారం చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జనాభాను నియంత్రించాలంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఓటు హక్కును తొలగించాలని అన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటి వాటిని తొలగిస్తేనే జనాభా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. హిందూ, ముస్లిం భేదాలు లేకుండా ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఈ నిబంధనలను వర్తింపజేయాలని బాబా రాందేవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Related posts