ఫిబ్రవరి 1 పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. ‘మోదీతో పాటు ఆయనకు తగ్గ ఆర్థిక సలహాదారుల బృందం ఆర్థిక వ్యవస్థను తారుమారు చేసింది’ అంటూ రాహుల్ విమర్శలు చేశారు.
గతంలో దేశ జీడీపీ 7.5 శాతంగా, ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం జీడీపీ 3.5 శాతంగా, ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉందని విమర్శించారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఏం చేయాలన్న విషయంపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వద్ద ఎటువంటి పరిష్కారం మార్గం లేదని ఆయన ట్వీట్ చేశారు.