telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించిన విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాపకింద నీరులా కోవిడ్-19 విస్తరించడంతో ఇప్పటివరకు తెలంగాణలో కూడా కేసుల సంఖ్య 360 దాటింది. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కొనసాగించడమే మంచిదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి విన్నవిస్తున్నానని తెలిపారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ నిర్ణయం సరైనదని విజయశాంతి కితాబిచ్చారు.కరోనాను పూర్తిగా అరికట్టాలంటే లాక్ డౌన్ ను మరిన్ని రోజులపాటు కొనసాగించాల్సిందేనని విజయశాంతి చెప్పారు. మధ్యలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

Related posts