ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ పాలన పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ ఎక్కడ? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏది? రైతు బంధు ఎక్కడికి పోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్ కు పేద, బడుగు బలహీన వర్గాలంటే పట్టింపే లేదన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు.
జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది: లోకేశ్